క్వారంటైన్‌కు మున్సిపల్‌ కమిషనర్‌


గుజరాత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తాజాగా ఈ  మహమ్మారి అధికారులను, రాజకీయ నేతలను కూడా వెంటాడుతున్నది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్ విజయ్‌ నెహ్రాను కూడా ఇప్పుడు కరోనా భయం వెంటాడుతున్నది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌కు వెళ్లారు. ఆయన ఓ కరోనా పాజిటివ్‌ పేషెంట్‌ను కలిసిరావడమే ఇందుకు అసలు కారణంగా తెలుస్తున్నది.  దీంతో ఆయన ముందస్తు జాగ్రత్తగా పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు.. నెహ్రా స్థానంలో ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్‌గా వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ముఖేష్ కుమార్ కొనసాగనున్నారు.